Thursday, September 6, 2007

MAHESH

మీరు ఎప్పుడయినా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారా? పోనీ గుడిలోకి వెళ్ళి వచ్చి గుడి మెట్లపై కూర్చున్నారా?

మన పెద్దలు మనము ఎప్పుడయినా గుడికి వెళ్ళితే, గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామంటారు.అలాగే గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. ఈ ఆచారం ఎందుకొరకు పెట్టారో తెలుసా? మన పూర్వీకుల కాలంలో శృంగార పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతగా లేదు. ఇప్పుడు కాలంలో యువత సిడీల ద్వారాను, టివీల ద్వారాను, పుస్తకాల ద్వారానూ శృంగార పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. అయితే ఆ కాలంలో శృంగారం గురించి తెలియాలంటే కామ శాస్త్రం చదవాల్సి వుండేది. అయితే అది కేవలం ఉన్నత శ్రేణి వారు లేదా పండితులకు మాత్రమే అర్ధమయ్యే భాషలో ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు గడప దాటి బయటకు వచ్చే వారు కాదు. సామన్యులకు సైతం ఈ కామశాస్త్రాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో, ఈ శాస్త్రాన్ని శిల్పకళగా మలచి అందరూ చూసే అవకాశముండునట్లుగా దేవాలయాలపై నిలిపే వారు. కాబట్టి గుడికి వచ్చే భక్తులందరూ వీటిని దర్శించే ఉద్దేశ్యంతో గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామన్నారు. అలాగే గాలి గోపురాలపై ఉండే విగ్రహాలను చూడడానికి వీలుగా గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. అయితే కొందరు ఈ ఉద్దేశ్యాన్ని గుర్తించలేక అలా తిరిగేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ శిల్పకళా లేదు. వాటి అవసరమూ కనిపించడం లేదు. అంతగా అభివృద్ది చెందింది మన యువత.

No comments: